వెంకటలక్ష్మి మూవీ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ

13 Mar,2019

భయపెట్టే వెంకటలక్ష్మి  : నిర్మాత ఎం. శ్రీధర్‌ రెడ్డి 
 
 
హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్‌ పతాకంపై ఎం. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్‌ రెడ్డి చెప్పిన విశేషాలు ... మాది అనంతపురం.  నేను ఇంజనీరింగ్ చదివాను. కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ గా కూడా వర్క్ చేశాను. ఆ తరువాత బిజినెస్ చేస్తూనే.. నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాను. నిజానికి నేను నిర్మతగా మారడానికి దిల్ రాజు గారే నాకు ప్రేరణ. నేను ఇంజనీరింగ్ చదువుకున్నే రోజులు నుంచీ ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ఆయన సినిమాలు తీసే విధానం నచ్చే.. నాకూ ప్రొడక్షన్ అంటే ఇంట్రస్ట్ కలిగింది.
మొదటి ప్రయత్నంగా .. ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ చేస్తున్నాను ఇది హర్రర్ మూవీ కాదు. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ కొంత భాగమే ఉంటాయి.  ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. రచయిత తటవర్తి కిరణ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఆయనే ఈ సినిమా దర్శకుడు కిషోర్‌ కుమార్‌ తీసుకొచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశాము. వెంకటలక్ష్మి పాత్రకోసం మొదట వేరే హీరోయిన్స్ ను అనుకున్నారు. కానీ వెంకటలక్ష్మి’ పాత్రలో రాయ్ లక్ష్మీ అయితేనే న్యాయం జరుగుతుందని.. నేనే ఆమెను హీరోయిన్ గా ఎంచుకోవడం జరిగింది. ఇప్పటివరకూ రాయ్ లక్ష్మీకు తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలను ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ మంచి పాత్రను చేశారు.
గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో వెంకటలక్ష్మి అనే టీచర్‌ చుట్టూ కథ జరుగుతుంది. సినిమాలో ప్రధానంగా కామెడీ, హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి, అలాగే వినోదంతో పాటు సస్పెన్స్‌ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఇక  తదుపరి చిత్రాల గురించి చెప్పాలంటే  రెండు మూడు కథలు కూడా ఉన్నాయి. అయితే ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి రిలీజ్ తరువాతే ఏది చెయ్యాలో ఎవరితో ఫైనల్ చేస్తాం. ఇకపై వరుసగా సినిమాలు నిర్మిస్తా అంటూ ముగించారు. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY